దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది
కన్నీరై బయటపడి జారిపోదామని
అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది
దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది
చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు
"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు
రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది
"నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ..
నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "
ఎప్పటిదో అయిన ఈ పుస్తకాన్ని చదివే అవకాశం ఈ మధ్యే కలిగింది, కాని చదువుతుంటే అనిపించింది ఇప్పటివరకు ఎందుకు చదవలేదని. సరదాగా ఓ ఐదేళ్ళ బుడ్డాడి కధగా మొదలయ్యి, తండ్రిని పోగొట్టుకున్న కుర్రాడి కధగా మారి కొంచం కష్టాలు కలుపుకొని అప్పటికాలపు విశేషాలను కలుపుకొంటూ కొంచం కారంగా సాగి పెద్దాడయిన బుడ్డాడి పరిపక్వతను చూపుతూ సాగే కథ చాలా బాగుంది. కాని ముగించిన విధమే ఎందుకో హడావిడిగా అనిపించింది, ముగింపు సరి కాదు అని అనను కానీ ఎందుకనో ఇంత మంచిగా సాగిన కధకు ఆ ముగింపు ఎందుకో చప్పగా అనిపించింది. కుదిరితే తప్పక చదవండి.
I found this book in Google books, check the 241 page of this book you will find details of Telugu poets
The given below given is taken from 25th Feb,2008 edition of outlook if you closely observe the snippet says something about “Telugu Rashtriya Samiti” and its chief K Chandrashekar Rao
. To the best of my understanding there was/is no party with the name “Telugu Rashtriya Samiti”(TRS). Its actually “Telengana Rashtriya Samiti”. Not sure how a popular magazine like OUTLOOK can make such a mistake.
చినుకు కోసం పడిగాపులు పడి
చినుకుకు చేమటధార చేర్చి
మట్టిని బంగారం చేసి
ఆ బంగారాన్ని అయినకాడికమ్మి
తన ఖర్మ ఇంతేననుకుంటూ
మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే రైతు
మీరు గూగుల్ బుక్స్ లో తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు ఉన్నది
ఎన్నికలు అయిపోయ్యాయి గోల్లుగిల్లుకోవడం చేతగాక ఎన్నికల తరువాత పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కాని నాది ఒక చిన్న సందేహం, ప్రజాస్వామ్యం లో ఎన్నికల తరువాత పొత్తులు సమ్మతమేనా? మిగతా అన్ని పార్టీ ల మీద వాటి నాయకుల మీద చిరాకేసి నేను లోకసత్తా కు ఓటు వేసాను అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వెళ్లి ఈ కాంగ్రెస్ తోనో లేక తెలుగు దేశం తోనో పొత్తు పెట్టుకొంటే నేను వేసిన ఓటు తప్పుగా ఉపయోగించుకున్నట్టేగా?
అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి గారికి వచ్చిన పబ్లిక్సిటీ చూస్తుంటే రేపు జయలలిత గారు కూడా ఉపవాసం చేస్తారేమో. అవ్విడగ్గారు మొదలు పెడితే నేను కూడా రేపు టిఫెన్ నుండి లంచ్ వరకు ఉపవాసమే. కనీసం రేపన్నా నాకు ఎవరన్నా నిమ్మరసం ఇస్తే పోను.
డీజీపీ మహంతి పుణ్యమా అని పోలీసులందరు హీరోలు అయిపోయి,ఓ కష్టపడి ఎవరనేది చూడకుండా గాలించేసి డబ్బులూ,మందు,నగలు పట్టుకొని కేసులు బుక్ చేసి సంతోషపడుతున్నారు.కాని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మందు పట్టుకోవటం వరకు మంచిదే కానీ ,డబ్బు,నగలు పట్టుకొని కోర్ట్లలో దాచి పెట్టడం వల్ల ఎవరికీ లాభం లేదేమోనని.
అందరికి తెలిసి,ఒప్పుకున్న విషయం ఏమిటంటే ఎన్నికలలో పంచె /ఖర్చు పెట్టె డబ్బాంత నల్లధనం. లెక్కల్లో లేని ధనం బయట పదే మార్గం ఎనికలోక్కీటే కదా. ఈ నిఘా వల్ల నల్ల ధనం బయట పదే ఓ ప్రదాన మార్గం మూసుకుపోయిందేమో.
అలా అన్నానని నేనెదో అప్రజాస్వామిక వాదిని కాదని ఓట్లు కొనదాన్నిప్రోత్సహిస్తున్నానని నన్ను నిందించే ముందు ఓసారి ఆలోచించండి, నల్ల ధనం బయట పెట్టె సరైన మార్గం,వ్యవస్థ విధానం లేనప్పుడు తప్పో ఒప్పో ఉన్నదానికి కొనసాగానివాడం ఒక్కటే మార్గమేమో.
అదీ కాకుండా ఓటు వెయ్యడానికి డబ్బు తీసుకొని,తీసూకున్నవళ్ళంతా ఓటు వేస్తారని నేను అనుకోవటంలేదు.ఎందుకంటే మనజనం తెలివి మీరిపోయి యధా రాజా తధా ప్రజా అన్నట్టు చెప్పిన మాట నిలబెట్టుకోవడం మానేశారు ఎప్పుడో
నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”
ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో పాటు ఓ సందేహం కూడా,నేను చదివే చాలామంది రచయితల్లో సంవత్సరాల వ్యాసాంగం కొనసాగించిన వారు ఉన్నారు.వారి శైలిలో పదాల కుర్పులే వచ్చాయి అని వెతకడానికి ప్రయథ్నిన్చను.ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేను చదువుతున్న” మధురాంతకం రాజారాం” కథల సంపుటీతో మొదలు పెట్టాను .ఈ నాలుగు కథల సంపుటాలు ఆయన 45 ఏళ్లు వ్రాసిన కథలతో కూర్చినవి. ప్రయత్న లోపం లేకుండా ఆయన శైలిలో 45 ఏళ్లలో వచ్చిన మార్పును వెలికి తీయడానికి ప్రయత్నించాను,పెద్దగా లాభం లేకపోయింది ఎందుకంటే పెద్దగా శైలిలో మార్పు లేదు,మొదటినుండి కథ చెప్పే విధానంలో అదే సౌమ్యత,అదే భవమ్.అప్పుదు అనిపించింది మంచి రచయితలు అందరు వారి శైలిని కొనసాగించడం తోనే గొప్పవారయ్యారేమోనని.
మీరు పుస్తక ప్రియులు అయినట్లయితే ఈ క్రింద ఉన్న సైటులో పుస్తకాల మార్పిడికి ఓ మంచి అవకాశం కలిపిద్దామని ప్రయత్నించాను.
ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే వాళ్ల రూపాయల కోసం ఆశ పడటం. ఆ ఆశతో ఇక్కడ మెడలు మిద్దేలు కొనేసి వాటి కోసం అప్పులు చేసి వాటిని నెలనెలా ఓ 20 సవత్సరాలకి సరిపోను తీర్చుకొంటూ ఈలోపల ఆ అమెరికాలో ఉన్నవాడు సుఖం గా ఉండి మనకి నెలనెలా డబ్బులు పంపుతూ ఉండాలని మనకి తెలిసిన తెలియని కోటిన్నొక్క దేవుళ్ళాకి మొక్కుతూ సుఖం గా బతుకుతున్నామని కనిపిస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తూ ఏమిటో మరి ఈ జీవితం.
మీ ఈ పధకం వల్ల జనం సోమరిపోతులుగా తయరవ్వరా? తినే తిండి నుండి ఉండే ఇల్లు వరకు అన్ని ఉచితమయినప్పుడు పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి కలుగుతుంది? కష్టించి పనిచేసి కూడా తనని తనవారిని పోషించికోలేని వాళ్లకి మాత్రమే ఈ పధకం వర్తింప చెయ్యాలి. అలాకాకుంటే పిల్లలకి మంచి చదువు చెప్పించే అవకాశం కల్పించండి, ప్రభుత్వ పాఠశాలలు బాగు చెయ్యండి కనీసం ఉపాద్యాయులను నియమించండి, రైతులకు ఆధునిక పద్దతులు ఉపయోగించుకొనే అవకాశం అవసరం కల్పించండి. వీటన్నిటికి లేని నిధులను జనానికి డబ్బులు పంచి పెట్టడానికి తీసుకు వస్తారు? మీవి ఓట్ల రాజకీయాలు రాష్ట్రాన్ని జనాన్ని నాశనం చెయ్యడానికి బాటలు వేస్తున్నారు.
మీరు వచ్చే ఎన్నికలలో ఓడిపోవాలని ఆశిసుస్తున్నాను ……
మీరు నాతో ఈకిభావిస్తే మీ అభిప్రాయాన్ని పార్టీ కి పంపండి
http://www.telugudesam.org/tdpcms/programs/feedback/feedback.html
స్నేహంతో మొదలవుతుందంటారు
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?
పరి పరి విధాల పోతుంది మనసు
నీ ఓర చూపు సోయగం
నీ వాలు జడ వయ్యారం
నీ పెదవి విరుపు కర్కశం
నీ కొనదేలిన ముక్కు పొగరు
నీ చల్లని వెన్నెల నవ్వు
నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై
నన్ను ఒకచోట నిలవనీక
నన్ను నేను గా ఉండనీక
నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:(
పది గంటలకు బడి అయితే తోమిదిన్నరకే సిద్ధంగా వుండే వాళ్ళం మహా అయితే నాలుగు పుస్తకాలు సంచిలో వేసుకొని. మొదటి గంట కొట్టగానే ఏదో తెలియని ఉత్సుకతగా వుండేది ప్రతిరోజు.
ఆడుతూ పాడుతూ పాఠం నేర్చుకుంటూ రెండు గంటలు గడిపితే పది నిమషాల విరామం ఆడే ఆటలకు లెక్కే వుండేది కాదు పదినిమషాలలో. మళ్ళా రెండు గంటల పాఠం. గంఠ కొట్టగానే ఇంటికి పరుగు,
అమ్మ పెట్టిందేదో తినేసి మరుక్షణం బడికి పరుగు ఆటలు సిద్దంగా వుండేవి మరి మళ్ళి బడి మొదలయ్యేలోపు. ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్చుకొని అలా ఇలా కాలక్షేపం చేస్తే ఓ గంట ఆటలకు సమయం
చిక్కేది. ఓ ఆట అనికాదు కబ్బడి మొదలుకొని పిచ్చి బంతివరకు అన్ని వుండేవి ఆ గంటలోనే. గంట గడవడం ఆలస్యం ఇంటికి పరుగు. అమ్మ పెట్టిన తాయిలం ఏదో తినేసి మళ్ళా ఆటలు. అల్లరి చేసి
స్నానం చేసి ఓ గంట చదివమనిపించి ఏదో తిన్నామనిపించి పక్క చేరడం. చందమామ కధ చదివి లేక చదివించుకొని లేక పెద్దవాళ్ళు చెప్పే రామాయణం భారతం వింటూ ఎదురు చూస్తున్న
కలలోకి జారిపోవడమే. తలచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది అహహ అనిపిస్తుంది మళ్ళా ఆరోజులు వస్తే బాగుండు అని అనిపిస్తుంది.
ఆ జీవితం ఆ జ్ఞాపకాలు మనం మన పిల్లలకు ఇవ్వగలమా? ఏమో మరి ఇప్పటి పోకడలు చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. నిండా నాలుగేళ్ళు నిండని బుడుద్దాయిలకి పరీక్షలు బడిలో చోటుకు.
బండెడు పుస్తకాలు పోటీఅంటు ఎవరితోనో మరి మరో గ్రహ వాసులుతోనేమో. ఇంత కష్టం లేకుండానే పడకుండానే ఆడుతూ పాడుతూ చదివిన చదువుతో నేను బాగున్నాను కదా మరి ఈ పిల్లలలకు
ఎందుకో మరి ఈ చదువు కష్టం.
మీ వ్యాఖ్యలు ఇక్కద కూడా ఇవ్వ వచ్చు http://indianhippy.com/index.php?page=telugu#badi
చాల రోజుల తరువాత తెలుగు రాయాలంటే ఏదో కొత్తగా వుంది అని చెప్పడానికి సిగ్గు వేస్తున్నది ఎందుకంటే నేను పదో తరగతి వరకు తెలుగు మీడియం లో చడువుకున్నవాడినే తెలుగు తప్ప ఏమి రానివాడినే(ఇప్పుడు ఏదో ఆంగ్ల పందితుడునని కాదు) కాని కాలం మారి పోయింది ఏమో నేనే మారిపోయ్యనేమో తెలియదు కానీ తెలుగు చదవడం వరకు సరే గాని రాయడం అంటే మాత్రం కొంచం కష్టంతో కూడు కున్న పనే అది ముఖ్యంగా కలం కాగితం పట్టుకొని రాయడం. తెలుగు లో పుట్టి తెలుగు లో పది సవత్సరాలు చదువుకొన్న నా పరిస్థితే ఇలా వుంటే మరి ఇవాళ పుట్టి తెలుగు చదువుకొనే ఆవకాశం లేక అవసరం లేక వున్న మన పిల్లల పర్ష్టితి ఏమిటో? కొన్ని సంవత్సరాలు పోతే తెలుగు పల్లెల్లో తప్ప మరెక్కడా కనపడదేమో. పల్లెలలో కూడా మారుతున్న పరిస్థుతులను చూస్తుంటే ఏమో మరి చెప్పలేము. మరి తెలుగును కాపాడటం ఎవరి చేతుల్లో వున్నదంటే ఆందరూ ఎదుటి వాడిని పక్కవాడిని చూపెడుతున్నారు ప్రభుత్యం తో సహా.
మీ వ్యాఖ్యలు ఇక్కద కూడా ఇవ్వ వచ్చు http://indianhippy.com/index.php?page=telugu#telugu







