దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది
కన్నీరై బయటపడి జారిపోదామని
అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది
దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది
చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు
"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు
రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది
"నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ..
నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "
I found this book in Google books, check the 241 page of this book you will find details of Telugu poets
"చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె
మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి
అంతలోనే సిగ్గుతో హోయలుపోయి
చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా
నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె
పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది"
చినుకు కోసం పడిగాపులు పడి
చినుకుకు చేమటధార చేర్చి
మట్టిని బంగారం చేసి
ఆ బంగారాన్ని అయినకాడికమ్మి
తన ఖర్మ ఇంతేననుకుంటూ
మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే రైతు
అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి గారికి వచ్చిన పబ్లిక్సిటీ చూస్తుంటే రేపు జయలలిత గారు కూడా ఉపవాసం చేస్తారేమో. అవ్విడగ్గారు మొదలు పెడితే నేను కూడా రేపు టిఫెన్ నుండి లంచ్ వరకు ఉపవాసమే. కనీసం రేపన్నా నాకు ఎవరన్నా నిమ్మరసం ఇస్తే పోను.
నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”
ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో పాటు ఓ సందేహం కూడా,నేను చదివే చాలామంది రచయితల్లో సంవత్సరాల వ్యాసాంగం కొనసాగించిన వారు ఉన్నారు.వారి శైలిలో పదాల కుర్పులే వచ్చాయి అని వెతకడానికి ప్రయథ్నిన్చను.ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేను చదువుతున్న” మధురాంతకం రాజారాం” కథల సంపుటీతో మొదలు పెట్టాను .ఈ నాలుగు కథల సంపుటాలు ఆయన 45 ఏళ్లు వ్రాసిన కథలతో కూర్చినవి. ప్రయత్న లోపం లేకుండా ఆయన శైలిలో 45 ఏళ్లలో వచ్చిన మార్పును వెలికి తీయడానికి ప్రయత్నించాను,పెద్దగా లాభం లేకపోయింది ఎందుకంటే పెద్దగా శైలిలో మార్పు లేదు,మొదటినుండి కథ చెప్పే విధానంలో అదే సౌమ్యత,అదే భవమ్.అప్పుదు అనిపించింది మంచి రచయితలు అందరు వారి శైలిని కొనసాగించడం తోనే గొప్పవారయ్యారేమోనని.
మీరు పుస్తక ప్రియులు అయినట్లయితే ఈ క్రింద ఉన్న సైటులో పుస్తకాల మార్పిడికి ఓ మంచి అవకాశం కలిపిద్దామని ప్రయత్నించాను.
పదునైన మాటలు కూర్చి పేర్చి
ఆవేశం అభినయం చేర్చి
జనాన్ని ఒప్పించి మెప్పించి
నిజం నిజాయితేనే మార్గమని
చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని
ఆలోచించమని అలోచించి వాడమని
ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి
కధం తొక్కుతూ తనకు తనే సాటని
జనం లోని వాడే జనం తోనే అని
జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు
స్నేహంతో మొదలవుతుందంటారు
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?
పరి పరి విధాల పోతుంది మనసు
నీ ఓర చూపు సోయగం
నీ వాలు జడ వయ్యారం
నీ పెదవి విరుపు కర్కశం
నీ కొనదేలిన ముక్కు పొగరు
నీ చల్లని వెన్నెల నవ్వు
నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై
నన్ను ఒకచోట నిలవనీక
నన్ను నేను గా ఉండనీక
నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:(







