"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు
రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది
"నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ..
నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "
"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు
రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది
"నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ..
నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "
ఎప్పటిదో అయిన ఈ పుస్తకాన్ని చదివే అవకాశం ఈ మధ్యే కలిగింది, కాని చదువుతుంటే అనిపించింది ఇప్పటివరకు ఎందుకు చదవలేదని. సరదాగా ఓ ఐదేళ్ళ బుడ్డాడి కధగా మొదలయ్యి, తండ్రిని పోగొట్టుకున్న కుర్రాడి కధగా మారి కొంచం కష్టాలు కలుపుకొని అప్పటికాలపు విశేషాలను కలుపుకొంటూ కొంచం కారంగా సాగి పెద్దాడయిన బుడ్డాడి పరిపక్వతను చూపుతూ సాగే కథ చాలా బాగుంది. కాని ముగించిన విధమే ఎందుకో హడావిడిగా అనిపించింది, ముగింపు సరి కాదు అని అనను కానీ ఎందుకనో ఇంత మంచిగా సాగిన కధకు ఆ ముగింపు ఎందుకో చప్పగా అనిపించింది. కుదిరితే తప్పక చదవండి.
"చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె
మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి
అంతలోనే సిగ్గుతో హోయలుపోయి
చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా
నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె
పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది"
అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి గారికి వచ్చిన పబ్లిక్సిటీ చూస్తుంటే రేపు జయలలిత గారు కూడా ఉపవాసం చేస్తారేమో. అవ్విడగ్గారు మొదలు పెడితే నేను కూడా రేపు టిఫెన్ నుండి లంచ్ వరకు ఉపవాసమే. కనీసం రేపన్నా నాకు ఎవరన్నా నిమ్మరసం ఇస్తే పోను.
నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”
ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో పాటు ఓ సందేహం కూడా,నేను చదివే చాలామంది రచయితల్లో సంవత్సరాల వ్యాసాంగం కొనసాగించిన వారు ఉన్నారు.వారి శైలిలో పదాల కుర్పులే వచ్చాయి అని వెతకడానికి ప్రయథ్నిన్చను.ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేను చదువుతున్న” మధురాంతకం రాజారాం” కథల సంపుటీతో మొదలు పెట్టాను .ఈ నాలుగు కథల సంపుటాలు ఆయన 45 ఏళ్లు వ్రాసిన కథలతో కూర్చినవి. ప్రయత్న లోపం లేకుండా ఆయన శైలిలో 45 ఏళ్లలో వచ్చిన మార్పును వెలికి తీయడానికి ప్రయత్నించాను,పెద్దగా లాభం లేకపోయింది ఎందుకంటే పెద్దగా శైలిలో మార్పు లేదు,మొదటినుండి కథ చెప్పే విధానంలో అదే సౌమ్యత,అదే భవమ్.అప్పుదు అనిపించింది మంచి రచయితలు అందరు వారి శైలిని కొనసాగించడం తోనే గొప్పవారయ్యారేమోనని.
మీరు పుస్తక ప్రియులు అయినట్లయితే ఈ క్రింద ఉన్న సైటులో పుస్తకాల మార్పిడికి ఓ మంచి అవకాశం కలిపిద్దామని ప్రయత్నించాను.