డీజీపీ మహంతి పుణ్యమా అని పోలీసులందరు హీరోలు అయిపోయి,ఓ కష్టపడి ఎవరనేది చూడకుండా గాలించేసి డబ్బులూ,మందు,నగలు పట్టుకొని కేసులు బుక్ చేసి సంతోషపడుతున్నారు.కాని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మందు పట్టుకోవటం వరకు మంచిదే కానీ ,డబ్బు,నగలు పట్టుకొని కోర్ట్లలో దాచి పెట్టడం వల్ల ఎవరికీ లాభం లేదేమోనని.
అందరికి తెలిసి,ఒప్పుకున్న విషయం ఏమిటంటే ఎన్నికలలో పంచె /ఖర్చు పెట్టె డబ్బాంత నల్లధనం. లెక్కల్లో లేని ధనం బయట పదే మార్గం ఎనికలోక్కీటే కదా. ఈ నిఘా వల్ల నల్ల ధనం బయట పదే ఓ ప్రదాన మార్గం మూసుకుపోయిందేమో.
అలా అన్నానని నేనెదో అప్రజాస్వామిక వాదిని కాదని ఓట్లు కొనదాన్నిప్రోత్సహిస్తున్నానని నన్ను నిందించే ముందు ఓసారి ఆలోచించండి, నల్ల ధనం బయట పెట్టె సరైన మార్గం,వ్యవస్థ విధానం లేనప్పుడు తప్పో ఒప్పో ఉన్నదానికి కొనసాగానివాడం ఒక్కటే మార్గమేమో.
అదీ కాకుండా ఓటు వెయ్యడానికి డబ్బు తీసుకొని,తీసూకున్నవళ్ళంతా ఓటు వేస్తారని నేను అనుకోవటంలేదు.ఎందుకంటే మనజనం తెలివి మీరిపోయి యధా రాజా తధా ప్రజా అన్నట్టు చెప్పిన మాట నిలబెట్టుకోవడం మానేశారు ఎప్పుడో








Recent Comments