మీ ఈ పధకం వల్ల జనం సోమరిపోతులుగా తయరవ్వరా? తినే తిండి నుండి ఉండే ఇల్లు వరకు అన్ని ఉచితమయినప్పుడు పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి కలుగుతుంది? కష్టించి పనిచేసి కూడా తనని తనవారిని పోషించికోలేని వాళ్లకి మాత్రమే ఈ పధకం వర్తింప చెయ్యాలి. అలాకాకుంటే పిల్లలకి మంచి చదువు చెప్పించే అవకాశం కల్పించండి, ప్రభుత్వ పాఠశాలలు బాగు చెయ్యండి కనీసం ఉపాద్యాయులను నియమించండి, రైతులకు ఆధునిక పద్దతులు ఉపయోగించుకొనే అవకాశం అవసరం కల్పించండి. వీటన్నిటికి లేని నిధులను జనానికి డబ్బులు పంచి పెట్టడానికి తీసుకు వస్తారు? మీవి ఓట్ల రాజకీయాలు రాష్ట్రాన్ని జనాన్ని నాశనం చెయ్యడానికి బాటలు వేస్తున్నారు.
మీరు వచ్చే ఎన్నికలలో ఓడిపోవాలని ఆశిసుస్తున్నాను ……
మీరు నాతో ఈకిభావిస్తే మీ అభిప్రాయాన్ని పార్టీ కి పంపండి
http://www.telugudesam.org/tdpcms/programs/feedback/feedback.html
Find more like this: Uncategorized , AP News, politics, telugu








2 comments Add your comment »
Get updates when new comments are added. Subscribe to the comments RSS Feed
March 6, 2009
12:01
ప్రజలకు ఏమి కావాలో అవే ఇస్తున్నాడు.
గత ఎన్నికలకు ముందు మీరు చెప్పినట్లే చంద్రబాబు అనుకొనేవాడు.
కాని ప్రజలేమి చేసారు? ఆయన మాట వినలేదు.
పెనంలోంచి పొయ్యిలో పడ్డారు.
గిమ్మిక్కులకే వోట్లు రాలే పరిస్థితిలో అందరూ అదే దారిలో వెళతారు.