చాల రోజుల తరువాత తెలుగు రాయాలంటే ఏదో కొత్తగా వుంది అని చెప్పడానికి సిగ్గు వేస్తున్నది ఎందుకంటే నేను పదో తరగతి వరకు తెలుగు మీడియం లో చడువుకున్నవాడినే తెలుగు తప్ప ఏమి రానివాడినే(ఇప్పుడు ఏదో ఆంగ్ల పందితుడునని కాదు) కాని కాలం మారి పోయింది ఏమో నేనే మారిపోయ్యనేమో తెలియదు కానీ తెలుగు చదవడం వరకు సరే గాని రాయడం అంటే మాత్రం కొంచం కష్టంతో కూడు కున్న పనే అది ముఖ్యంగా కలం కాగితం పట్టుకొని రాయడం. తెలుగు లో పుట్టి తెలుగు లో పది సవత్సరాలు చదువుకొన్న నా పరిస్థితే ఇలా వుంటే మరి ఇవాళ పుట్టి తెలుగు చదువుకొనే ఆవకాశం లేక అవసరం లేక వున్న మన పిల్లల పర్ష్టితి ఏమిటో? కొన్ని సంవత్సరాలు పోతే తెలుగు పల్లెల్లో తప్ప మరెక్కడా కనపడదేమో. పల్లెలలో కూడా మారుతున్న పరిస్థుతులను చూస్తుంటే ఏమో మరి చెప్పలేము. మరి తెలుగును కాపాడటం ఎవరి చేతుల్లో వున్నదంటే ఆందరూ ఎదుటి వాడిని పక్కవాడిని చూపెడుతున్నారు ప్రభుత్యం తో సహా.
మీ వ్యాఖ్యలు ఇక్కద కూడా ఇవ్వ వచ్చు http://indianhippy.com/index.php?page=telugu#telugu








Recent Comments